ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 30 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 30, సోమవారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ సమావేశాలు ఐదురోజుల పాటు అనగా డిసెంబర్ 4వ తేదీవరకు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే సభ ఎన్ని రోజులు జరగాలి, ఏయే అంశాలు చర్చించాలి అనే దానిపై రేపు జరగబోయే ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ