ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 26, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,65,705 కు, మరణాల సంఖ్య 6970 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 67,269 కరోనా పరీక్షలు నిర్వహించగా 1031 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 8 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు, కడప లో ఒకరు, తూర్పుగోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, కర్నూల్ లో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6970 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 8,46,120 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లో 1081 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 12615 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ