జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

AP BJP President Somu Veerraju, Ap Political News, Janasena, Janasena President, Janasena President Pawan Kalyan, pawan kalyan, Pawan Kalyan Latest News, Somu Veerraju Meets, Somu Veerraju Meets Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగస్టు 7, శుక్రవారం నాడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సోము వీర్రాజుకు పవన్ కళ్యాణ్ శాలువా కప్పి సత్కరించి, అభినందనలు తెలిపారు. గతంలోనే ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అధ్యక్షులు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చినట్టు సమాచారం. మరోవైపు గురువారం నాడు ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని కూడా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోము వీర్రాజు కలిసిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eleven =