కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంతంగా దుకాణాలున్న నాయీ బ్రహ్మణులకు, రజకులకు, టైలర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందించే జగనన్న చేదోడు’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ జూన్ 10, బుధవారం నాడు ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.10,000 చొప్పున నగదు జమ అయ్యే పక్రియను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ.10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రహ్మణులు, టైలర్లు, రజకులలో ఈ పథకానికి సుమారు 2,47,040 మంది లబ్దిదారులు ఎంపిక కాగా, వారి ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.247.04 కోట్లను జమ చేయనుంది. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పారదర్శక పద్ధతిలో ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ పథకానికి ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చామని, ఇప్పటికే పలు సంక్షేమ పథకాల ద్వారా 3.58 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూర్చినట్టు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu