ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదించాల్సి బిల్లులుపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. అలాగే మున్సిపల్ ఎన్నికలు, విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ, తిరుపతిలో జరగనున్న దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం సహా రాష్ట్రంలో అమలు చేయనున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలుపై ఈ కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ