ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు నేడు ఈ కేసుపై సుప్రీంలో విచారణ జరుగగా. ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఇక గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని రైతులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో నేడు దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాజధానిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితిపై సుప్రీం స్టే విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఆదేశించలేమని, అభివృద్ధి అంతా ఒకేచోట చేయాలని కూడా చెప్పలేమని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE