ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్లు రూ.2,500 అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేబినెట్ తాజా నిర్ణయంతో 2023 జనవరి నుంచి, అంటే.. వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ.2750కి పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62.31 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. అలాగే దీనితో పాటు వైఎస్సార్ పశువుల భీమా పథకం మరియు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్గా క్లాసుల నిర్వహణ, నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఫౌండేషన్ పాఠశాలల్లో స్మార్ట్ టీవీ రూములను నిర్మించడం వంటి ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ