ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన గృహ నిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ హౌస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ డి. దొరబాబు, ఏపీ టిడ్కో ఛైర్మన్ ప్రసన్న కుమార్, మునిసిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, భూ పరిపాలన హౌసింగ్ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం జగన్ చేసిన కీలక సూచనలు..
- రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం.
- ఆప్షన్ త్రీ కింద ఎంపిక చేసిన ఇళ్ల నిర్మాణాలు ప్రభుత్వం నేరుగా చేపట్టే పనులు త్వరితగతిన పూర్తిచేయాలి.
- ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించాలి.
- ఆయా కాలనీల్లో మౌలిక వసతులు కల్పించిన తర్వాతే లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులు జరపాలి.
- నిర్మాణాలు పూర్తయ్యేనాటికి తప్పనిసరిగా డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి.
- అన్ని లే-అవుట్లలో ప్రాధాన్యతా పరంగా పనులను గుర్తించి సమయానికి పూర్తి చేయాలి.
- టిడ్కో ద్వారా చేపట్టే నిర్మాణాలు నాణ్యతతో ఉండేలా చూడాలి.
- నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు ఎస్ఓపీలను అందుబాటులో ఉంచాలి.
- దీనికోసం గ్రామ సచివాలయాల్లో ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలి.
- టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి.
- అలాగే టిడ్కో గృహాల నిర్వహణపై దృష్టి సారించి ప్రణాళికలు సిద్ధం చేయాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE