ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం వైఎస్ జగన్ జగన్ కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో సీఎంను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో శనివారం చేపట్టాల్సిన ఢిల్లీ పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. ముందుగా దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు మరియు అభివృద్ధి పనులపై సమీక్షించడం కోసం కేంద్ర హోంశాఖ సెప్టెంబర్ 26న సమావేశం ఏర్పాటు చేసింది.
ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర్ప్రదేశ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనాల్సి ఉంది. తాజాగా సీఎం వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకోవడంతో, సీఎంకు బదులుగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీకి వెళ్లి, అమిత్ షా నేతృత్వంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ