ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’, చెడుపై ‘మంచి’, అజ్ఞానంపై ‘జ్ఞానం’, దుష్ట శక్తులపై ‘దైవశక్తి’ సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని సీఎం వైఎస్ జగన్ అభిలషించారు.
దీపావళి అంటే దీపాల వరస…
దుష్ట రాక్షస శిక్షణ చేసే దైవ శక్తి,
దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేసే స్త్రీ శక్తి,
మోగించిన విజయ దుందుభికి ప్రతీక…
మనం నేడు వెలిగించే… ఆ దీపాల వరస!
చీకట్లను చీల్చే వెలుగుల పండగ సందర్భంగా
రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు!— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY