ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్ననాయకుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా తొలిగిపోవాలని ఆయన తన సందేశంలో ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రతి ఇంటిలో సుఖ సంతోషాలను నింపాలని కోరుకున్న సీఎం జగన్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది విఘ్నేశ్వరుని ఆశీస్సులతో సాధించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆ ఏకదంతుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ