ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీలో గెలుపొందిన బీజేపీ కార్పోరేటర్లతో కలిసి పాతబస్తీలోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రజలకు ఎప్పుడూ అందుబాటు ఉంటూ అవినీతికి పాల్పడకుండా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తామని కార్పొరేటర్లతో బండి సంజయ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ