ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదలతో కొన్ని చోట్ల ప్రాణనష్టంతో పాటుగా పంట నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించారు. ముందుగా గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకున్న సీఎం వైఎస్ జగన్ అక్కడ నుంచి హెలికాప్టర్ లో అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మరోవైపు ఏపీలో వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చాను.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ