జాతీయస్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే దిశగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల దేశవ్యాప్త పర్యటన వివరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ, చండీగఢ్ లలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం (మే 26, గురువారం) సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జనతాదళ్ (సెక్యూలర్) జాతీయ అధ్యక్షుడు, మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీ సందర్భంగా దేశంలో తాజా పరిస్థితులు సహా, పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు బెంగుళూరు పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ మే 27వ తేదీన రాలేగావ్ సిద్ది పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. అక్కడ నుంచి సాయిబాబా దర్శనం కోసం సీఎం షిరిడీ వెళ్లనున్నారు. అక్కడనుంచి పర్యటనను ముగించుకుని సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF