ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే దీనిపై సూచనప్రాయంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐదేళ్ల పదవీ కాలంలో తొలిసగం తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని అప్పుడే ఆయన తెలిపారు. అప్పటినుంచి ఆశావహులు ఈ సమయంకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు సీఎం జగన్ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సహచర మంత్రులతో చేసిన సీఎం జగన్ చేసిన ప్రస్తావన చర్చనీయాంశం అవుతోంది. కొంత మంది మంత్రులు పదవులు త్యజించటానికి సిద్ధంగా ఉండాలని, వారి సేవలను పార్టీ కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు. అయితే, అందుకు వారు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే, కొంత మంది మంత్రులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని తెలిపారు. అనేక సమీకరణల ఆధారంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని జగన్ వెల్లడించినట్లుగా వార్తలొస్తున్నాయి. కాగా, కొంత మంది మాత్రం మంత్రి పదవిలోనే ఉంటారని సీఎం జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ