దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71 వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అలాగే వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు సహా పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రచించిన “నాలో.. నాతో వైఎస్ఆర్” పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం ట్రిపుల్ ఐటీకి చేరుకొని కొత్త భవన సముదాయానికి సీఎం ప్రారంభోత్సవం చేశారు. 3 మెగా వాట్ల సోలార్ ప్లాంట్, సహా ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ట్రిపుల్ ఐటీ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. మరోవైపు వైఎస్ఆర్ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతు దినోత్సవంగా నిర్వహిస్తుంది. రైతు దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu