విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మందికి పైగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ లీకేజి ఘటనకు సంబంధించి ఎల్.జి.పాలిమర్స్ సీఈవో అండ్ ఎండీ సుంకీ జియోంగ్, డైరెక్టర్లు డీఎస్ కిమ్, పి.పూర్ణచంద్రమోహన్ రావు సహా మొత్తం 12 మందిని జూలై 7, మంగళవారం నాడు విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్రప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సోమవారం నాడే ప్రమాదానికి గల కారణాలతో తుది నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించింది. ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో నివేదిక సమర్పించిన మరుసటిరోజే మొత్తం 12 మంది పరిశ్రమ ప్రతినిధులు అరెస్ట్ కావడం విశేషం. వీరి అరెస్ట్ తో పాటుగా ఈ ఘటనలో మరో ముగ్గురు అధికారులపై కూడా ప్రభుత్వం వేటు వేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu