భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7.5 లక్షలకు చేరువైంది. జూలై 8, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,42,417 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 22,752 కరోనా పాజిటివ్ కేసులు, 482 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉండడం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 61.13 శాతంగా ఉన్నట్టు ప్రకటించారు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 8, ఉదయం 8 గంటల వరకు) :
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 7,42,417
కొత్తగా నమోదైన కేసులు (జూలై 7 – జూలై 8 (8AM-8AM) : 22,752
నమోదైన మరణాలు : 482
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 4,56,831
యాక్టీవ్ కేసులు : 2,64,944
మొత్తం మరణాల సంఖ్య : 20,642
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu