ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

Andhra Pradesh Latest News, AP Breaking News, Ap Cm Ys Jagan Latest News, AP CM YS Jagan To Tour In Villages, Ap Political Live Updates, Ap Political News, AP Political Updates 2020, Mango News Telugu, YS Jagan To Tour In Villages Across State
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు, పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రచ్చబండ తరహా కార్యక్రమానికి శ్రీకారం చూడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పథకాలు అమలుపై ప్రజల నుంచి స్పందన తెలుసుకోవాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందుకోసం పల్లెబాటలో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై స్పందన తెలుసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉండనుంది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =