రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. బుధవారం ప్రధాని మోదీతో కీలక భేటీ

AP CM YS Jagan To Visit Delhi Tomorrow Will Meet PM Narendra Modi on Dec 28,YS Jagan Mohan Reddy,PM Narendra Modi,Jagan To Meet PM Narendra Modi,Mango News,Jagan Latest News And Updates,Ap Cm Ys Jagan Mohan Reddy,Tdp Party, Ysr Congress Party,Janasena Party,Andhra Pradesh,Ap Politics,Ap Political News And Updates,Ap Cm Jagan Srikakulam Tour,Jagan Tour Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ఆయన, బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఇక ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్, ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు వంటి వాటిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు సహా పలు కీలక అంశాల గురించి ప్రధాని మోదీకి వివరించనున్నారని సమాచారం. కాగా ఈ నెలలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడం రెండోసారి. అంతకుముందు ఆయన ఈ నెల మొదటి వారంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్‌లో ఏపీ సీఎం పాల్గొన్న విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =