తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. ఏపీలో ఏప్రిల్ 8 న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన తనకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తునట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీ ఇన్ఛార్జ్గా మాత్రం కొనసాగుతానని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ