కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సహా మరికొందరు మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వారికి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ స్మారకం ‘రాజ్ ఘాట్’, అటల్ బిహారీ వాజ్పేయి స్మారక చిహ్నం ‘సదైవ్ అటల్’ల వద్ద నివాళులర్పించారు. అలాగే ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ స్మారకాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా రాహుల్ గాంధీ.. తన భారత్ జోడో యాత్ర మార్చ్ తర్వాత శనివారం మాజీ ప్రధానులకు నివాళులర్పించాలని అనుకున్నారు. కానీ యాత్ర పూర్తయ్యేసరికి ఆలస్యం కావడంతో దానిని సోమవారం ఉదయానికి వాయిదా వేనుకున్నారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం తన ముత్తాత, భారత తొలి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ, తన నానమ్మ, మాజీ ప్రధాని అయిన ఇందిరా గాంధీ, అలాగే తన తండ్రి మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ స్మారక చిహ్నాలైన ‘శాంతి వనం, వీర్ భూమి, శక్తి స్థల్’ లను ఆయన సందర్శించారు. వారితో పాటు ఆయన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్మారకం ‘విజయ్ ఘాట్’ను సందర్శించి నివాళులర్పించారు. ఇక రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్నది. అయితే క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యాత్రకు దాదాపు 8 రోజులు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో జోడో యాత్ర మళ్ళీ జనవరి 3న తిరిగి పునఃప్రారంభం కానున్నది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ