ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(డిసెంబర్ 20, మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ లో మంగళవారం నిర్వహించనున్న క్రిస్మస్ తేనీటి విందు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ముందుగా సీఎం వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 5.30 గంటలకు ఏ ప్లస్ కన్వెన్షన్కు చేరుకుని ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ తేనేటి విందుకు సీఎంతో పాటుగా మంత్రులు, పలువురు ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం 6 గంటలకు సీఎం వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE