ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని అన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు వెనుక ఉద్దేశం ఏంటని? టీడీపీకి లబ్ది చేకూర్చడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నా, చంద్రబాబు ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తరపున పని చేస్తున్నానని పవన్ చెప్పాలని, వారిద్దరి మధ్య ఉన్న ముసుగును తొలగించాలని రామకృష్ణారెడ్డి కోరారు.
ఇక మాచర్ల ఘటన ద్వారా చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయట పడిందని, మాచర్లను అగ్ని గుండంలా మార్చాలనేది చంద్రబాబు ప్రయత్నమని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇక్కడ టీడీపీ ఇంచార్జి గా బ్రహ్మారెడ్డిని నియమించారని, వాళ్లే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసి, ఆ తర్వాత ప్రభుత్వ వైఫల్యం అని ఆరోపిస్తారని మండిపడ్డారు. ఏపీలో సీఎం జగన్ను అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని, చంద్రబాబు, పవన్ పవన్ కల్యాణ్లు కోరుకుంటే అది జరగదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న ప్రజలు అనుకుంటేనే అది సాధ్యపడుతుందని, అయితే రాష్ట్రంలో అన్ని కులాల వారిని రాజ్యాధికారంలో భాగం చేసే దిశగా సీఎం జగన్ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్న క్రమంలో అది అసంభవమని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE