ఆంధ్రప్రదేశ్ను ‘నార్కోటిక్స్ ఫ్రీ స్టేట్’గా మార్చాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఏపీ ఎక్సైజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)పై నిర్వహించిన సమీక్షలో భాగంగా పలు కీలక సూచనలు చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మరియు ఏపీ ఎక్సైజ్ మినిష్టర్ నారాయణ స్వామి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఎక్సైజ్, ఎస్ఈబీపై సమీక్షలో సీఎం జగన్ చేసిన పలు కీలక సూచనలు, ఆదేశాలు..
- ఏపీలో ఎక్కడా నార్కోటిక్స్ వినియోగం ఉండరాదు. ఇదే లక్ష్యంతో పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేయాలి.
- నార్కోటిక్స్ సహా అక్రమ మద్యంపై కూడా దృష్టి సారించి పూర్తిగా అరికట్టాలి.
- అలాగే సచివాలయాలలో మహిళా పోలీసుల పనితీరు మెరుగు పరిచేలా చర్యలు చేపట్టాలి.
- రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశ చట్టం మరియు దిశ యాప్లు మరింత పక్కాగా అమలయ్యేలా చూడాలి.
- దిశ యాప్ వినియోగం, కాల్స్, సత్వర స్పందనపై అన్ని చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించి మహిళలకు అవగాహన కల్పించాలి.
- ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించి మరింత సమర్థవంతంగా పనిచేయాలి.
- రాష్ట్రంలో అక్రమ మద్యం నియంత్రణ, గంజాయి సాగును అరికట్టేందుకు ఎస్ఈబీ, ఎక్సైజ్ అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలి.
- విద్యార్థులు నార్కోటిక్స్ వినియోగించకుండా నిరోధించాలి. దీనికోసం అన్ని కాలేజీలు, యూనివర్శిటీల వద్ద అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఏర్పాటు చేయాలి.
- అలాగే దీనికోసం ఏర్పాటు చేసిన ఎస్ఈబీ ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ 14500 ను హోర్డింగ్స్ లో ప్రదర్శించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE