ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరో పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు ఉచిత బోర్లు తవ్వించే “వైఎస్ఆర్ జలకళ” పథకాన్ని సెప్టెంబర్ 28 న లాంఛనంగా ప్రారంభించనున్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో మొత్తం 1.98 లక్షల పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతుంది.
ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజక వర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్ రిగ్ వాహనాలను సెప్టెంబర్ 28 న సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఈ పథకానికి అర్హులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు రూపొందించిన వెబ్సైట్ను కూడా సీఎం ప్రారంభించనున్నారు. వెబ్సైట్ ద్వారానే కాకుండా ఎంపీడీవోల ద్వారా కూడా ఉచితబోరు కోసం రైతులు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu