తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్‌

AP CM YS Jagan, AP CM YS Jagan Mohan reddy, Brahmotsavam 2020, CM YS Jagan, Lord Venkateswara at Tirumala, Silk Clothes To Lord Venkateswara, Srivari Brahmotsavalu, Tirumala, Tirumala Brahmotsavam 2020, Tirumala Brahmotsavams, Tirumala Srivari Brahmotsavalu, tirumala srivari brahmotsavam 2020, Tirumala temple, Tirumala Tirupati Devasthanam, tirumala tirupati srivari brahmotsavam, Tirupati, YS Jagan Offers Silk Clothes To Lord Venkateswara

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నాడు గరుడసేవను పురస్కరించుకుని సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ముందుగా అర్చకులు సంప్రదాయ బద్ధంగా సీఎంకు తలపాగా చుట్టారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ శ్రీవారికి సీఎం వైఎస్ జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి గరుడవాహన సేవలో సీఎంతో పాటుగా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం శ్రీ పద్మావతి అతిధి గృహానికి సీఎం చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం కూడా సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన కొనసాగనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =