తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నాడు గరుడసేవను పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ముందుగా అర్చకులు సంప్రదాయ బద్ధంగా సీఎంకు తలపాగా చుట్టారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ శ్రీవారికి సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి గరుడవాహన సేవలో సీఎంతో పాటుగా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం శ్రీ పద్మావతి అతిధి గృహానికి సీఎం చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం కూడా సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన కొనసాగనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu