ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 22, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,694 కు చేరగా, మరణించిన వారి సంఖ్య 7146 కి పెరిగింది. కొత్తగా 167 మంది కరోనా నుంచి రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన గుంటూరు, అనంతపూర్, కర్నూల్ మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అలాగే గత 24 గంటల్లో 48313 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, ఏపీలో మొత్తం పరీక్షల సంఖ్య 1,27,87,961 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జనవరి 22, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,86,694
- కొత్తగా నమోదైనా కేసులు : 137
- కొత్తగా నమోదైన మరణాలు : 4
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,78,060
- యాక్టీవ్ కేసులు : 1488
- మొత్తం మరణాల సంఖ్య : 7146
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ