ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 9, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,555 కు చేరుకుంది. సోమవారం 9AM నుంచి మంగళవారం 9AM వరకు 26,844 కరోనా పరీక్షలు నిర్వహించగా 70 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక కరోనా వలన కొత్తగా ఎటువంటి మరణం సంభవించలేదు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7160 గా ఉంది. మరోవైపు గత 24 గంటల్లో 115 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,80,478 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 917 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ