ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 14, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,18,884 కు పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అనంతపురంలో 8, తూర్పుగోదావరిలో 7, పశ్చిమగోదావరిలో 4, గుంటూరులో 2, విశాఖపట్నంలో 2 నమోదయ్యాయి. ఇక కరోనా వలన మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది. గడిచిన 24 గంటల్లో 85 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 23,03,607 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 547 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(26):
- అనంతపురం – 8
- తూర్పుగోదావరి – 7
- పశ్చిమగోదావరి – 4
- గుంటూరు – 2
- విశాఖపట్నం – 2
- ప్రకాశం – 1
- చిత్తూరు – 1
- కడప – 1
- నెల్లూరు – 0
- కృష్ణా – 0
- కర్నూల్ – 0
- శ్రీకాకుళం –0
- విజయనగరం – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ