ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. వరుసగా ఎనిమిదో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10,199 కేసులతో కలిపి సెప్టెంబర్ 3, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 4,65,730 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 62,225 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన తూర్పుగోదావరి జిల్లాలో పదిమంది, చిత్తూరులో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఏడుగురు, కృష్ణాలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, కడపలో ఐదుగురు, కర్నూల్ లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4200 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 3,57,829 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 9499 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 1,03,701 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu