భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. దేశంలో ఇప్పటికి 38 లక్షలకు పైగా కరోనా కేసులు, 67 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 83,883 కరోనా కేసులు, 1043 మరణాలు నమోదయ్యాయి. దీంతో సెప్టెంబర్ 3, గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,53,406 కు, మరణాల సంఖ్య 67,376 కు చేరుకుంది. కాగా దేశంలో కరోనా మరణాల రేటు 1.7 శాతంగా ఉంది. మరోవైపు ఒకే రోజులో 68,584 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 29,70,492 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 77.1 శాతంగా నమోదైంది. ఇక ఆసుపత్రుల్లో మరియు హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 8,15,538 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu