ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10601 పాజిటివ్ కేసులు, 73 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,17,094 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 4560 కి పెరిగింది. మరో 11691 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 70,993 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన గుంటూరుజిల్లాలో పది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, కడపలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4560 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 8, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 42,37,070
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 5,17,094
- కొత్తగా నమోదైనా కేసులు : 10601
- నమోదైన మరణాలు : 73
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 4,15,765
- యాక్టీవ్ కేసులు : 96769
- మొత్తం మరణాల సంఖ్య : 4560
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu