భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 75809 కేసులు,1133 మరణాలు నమోదయ్యాయి. సెప్టెంబర్ 8, మంగళవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 42,80,422 కు, మరణాల సంఖ్య 72,775 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 33 లక్షలు దాటింది. ఒకే రోజులో 73,521 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 33,23,950 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 77.7 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.7 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 8, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 42,80,422
- కొత్తగా నమోదైన కేసులు [సెప్టెంబర్ 7–సెప్టెంబర్ 8 (8AM-8AM)] : 75809
- నమోదైన మరణాలు : 1133
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 33,23,950
- యాక్టీవ్ కేసులు : 8,83,697
- మొత్తం మరణాల సంఖ్య : 72,775
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu