ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 20034 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 4, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,84,028 కు చేరింది. కొత్తగా అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 2398, చిత్తూరులో 2318, అనంతపూర్ లో 2168, విశాఖపట్నంలో 1976, ప్రకాశంలో 1741, గుంటూరులో 1678, కర్నూల్ లో 1396, పశ్చిమగోదావరిలో 1258, నెల్లూరులో 1160, తూర్పుగోదావరిలో 1075, విజయనగరంలో 1075 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 12,207 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 82 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 8289 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,15,784 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,68,33,932 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (మే 4, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 11,84,028
- కొత్తగా నమోదైన కేసులు : 20,034
- కొత్తగా నమోదైన మరణాలు : 82
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 10,16,142
- యాక్టీవ్ కేసులు : 1,59,597
- మొత్తం మరణాల సంఖ్య : 8289
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ