ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మధ్యాహ్నం 12 తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలుకు ఆమోదం

Minister Perni Nani Press Meet over AP Cabinet Meeting Decisions,Mango News,Mango News Telugu,LIVE,Minister Perni Nani Press Meet on AP Cabinet Meeting Decisions,Minister Perni Nani Press Meet,Minister Perni Nani Press Meet Live,Perni Nani Press Meet Live,Minister Perni Nani,Perni Nani,AP Cabinet Meeting,AP,AP Cabinet,Minister Perni Nani Press Meet Latest,Minister Perni Nani Latest News,Minister Perni Nani Live,Minister Perni Nani Live News,Minister Perni Nani News,Minister Nani Press Meet Live,AP Cabinet Meeting Decisions,CM YS Jagan,AP News,AP Politics,Perni Nani Press Meet,AP Cabinet Decisions Press Meet Live,AP Cabinet Decisions Live,AP Cabinet Meeting Updates,AP Cabinet Meeting Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన మే 4, మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • మే 5, బుధవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలుకు మంత్రి వర్గం ఆమోదం. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలకు అనుమతి.
  • మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణాతో పాటుగా ప్రైవేటు వాహనాలు రాకపోకలపై నిషేధం. అలాగే అంతరాష్ట్ర సర్వీసులు కూడా రద్దు చేస్తూ నిర్ణయం.
  • మే 13న రైతు భరోసా తొలి విడత కింద 54 లక్షల మంది రైతులకు లబ్దిచేకూరేలా, వారి ఖాతాల్లో రూ.4040 కోట్లు జమ.
  • మే 18న వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం అమలు. 1,00,460 మంది మత్స్యకారులకు రూ.10వేల చొప్పున సాయం అందజేత.
  • మే 25 వ తేదీన వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం అమలు, మొత్తం 38 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2805 కోట్లు జమ.
  • 176 పీహెచ్‌సీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం, రూ.511.79 కోట్లు కేటాయింపు.
  • 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ విధానానికి కేబినెట్‌ ఆమోదం.
  • ప్రైవేట్‌ యూనివర్శిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాకు ఇచ్చేలా చట్టంలో మార్పుకు ఆమోదం.
  • అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15 వేల గౌరవ వేతనం పెంపు. అలాగే బి కేటగిరి ఆలయాల్లో రూ.5 వేల నుంచి రూ.10 వేలకు గౌరవ వేతనం పెంచుతూ కేబినెట్ నిర్ణయం.
  • ఇమామ్‌లకు రూ.5 వేల నుంచి రూ.10 వేల గౌరవ వేతనం పెంపు. అలాగే మౌజమ్‌లకు రూ.3 వేల నుంచి రూ.5 వేల గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం.
  • కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఎస్సార్‌ స్టీల్స్‌కు అప్పగింగించేందుకు కేబినెట్‌ ఆమోదం, అలాగే కృష్ణపట్నం పోర్టులో మౌలిక వసతులకు రూ.1448 కోట్లు మంజూరు ఆమోదం.
  • ప్రతి పీహెఛ్సికి ఇద్దరు డాక్టర్లు, 104 వాహనం కేటాయింపు, ప్రతి ఏజెన్సీ మండలానికి మూడు పీహెచ్‌సీలు ఏర్పాటుకు నిర్ణయం.
  • ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ తీసుకొచ్చేలా చర్యలు.
  • కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో 45 ఏళ్లు పైబడినవారికి తొలి ప్రాధాన్యత, అనంతరమే 18-44ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణి చేయాలని నిర్ణయం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =