ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. దీంతో గత కొన్ని రోజులగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 4074 కేసులతో కలిపి జూలై 20, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 53724 కు చేరింది. గత 24 గంటల్లో 33580 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మరోవైపు కరోనా వలన రాష్ట్రంలో మరో 54 మంది మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, కృష్ణాలో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, కర్నూల్ లో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 692 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 20, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 13,49,112
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 53724
- కొత్తగా నమోదైన కేసులు : 4074
- నమోదైన మరణాలు : 54
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 24228
- యాక్టీవ్ కేసులు : 28800
- మొత్తం మరణాల సంఖ్య : 696
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu