ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 17, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,348 కు, మరణాల సంఖ్య 7069 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా 534 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన అనంతపూర్ జిల్లాలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. మరోవైపు గత 24 గంటల్లో 498 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,65,825 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4454 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ