ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ చార్జీలు పెంచుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. 0-30 యూనిట్ల వరకూ యూనిట్ కు 45 పైసలు పెరగనుండడంతో ఈ స్లాబ్ లో చార్జీలు రూ.1.45 నుంచి రూ.1.90 కు చేరింది. 31-75 యూనిట్ల వరకూ యూనిట్ కు 91 పైసలు పెంచనున్నారు. దీంతో ఈ స్లాబ్ చార్జీలు రూ.2.09 నుంచి రూ.3 కు చేరాయి.
అలాగే 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.40 పైసలు (రూ.3.10 నుంచి రూ.4.50) పెంచనున్నారు. ఇక 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 చొప్పున (రూ.4.43 నుంచి రూ.6), 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.16 పైసలు చొప్పున (రూ.7.59 నుంచి రూ.8.75), 400 యూనిట్లకు పైన యూనిట్ కు రూ.55 పైసలు చొప్పున (రూ.9.20 నుంచి రూ.9.75)పెంచేందుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇచ్చింది. ఈ విద్యుత్ చార్జీల పెంపు వివరాలను ఏపీఈఆర్సీ ఛైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి బుధవారం నాడు వెల్లడించారు. కాగా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ