ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,03,935 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1068, చిత్తూరులో 854, పశ్చిమగోదావరిలో 758, ప్రకాశంలో 451, కృష్ణాలో 435 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,44,917 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 45 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో తొమ్మిది మంది, తూర్పుగోదావరిలో ఐదుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, కడపలో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12269 కి పెరిగింది. గత 24 గంటల్లో 8014 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 17,67,404 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 65,244 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ