ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒక్కరోజే 65 మంది మృతి

AP Corona Updates, andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 6045 కరోనా పాజిటివ్ కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. అలాగే మరో 6494 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. కొత్తగా నమోదైన 6045 కేసులతో కలిపి జూలై 22, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం‌ కేసుల సంఖ్య 64713 కు చేరింది. గత 24 గంటల్లో 49553 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. కరోనా వలన గుంటూరులో పదిహేనుమంది, కృష్ణాలో పదిమంది, పశ్చిమ గోదావరిలో ఎనిమిది మంది, తూర్పు గోదావరిలో ఏడుగురు, చిత్తూరులో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కడపలో ఒకరు, నెల్లూరులో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 823 కి చేరింది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 22, ఉదయం 10 గంటల వరకు) :

రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 14,35,827
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 64713
కొత్తగా నమోదైనా కేసులు : 6045
నమోదైన మరణాలు : 65
డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 32127
యాక్టీవ్ కేసులు : 31763
మొత్తం మరణాల సంఖ్య : 823

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − nine =