తెలంగాణలో రాష్ట్రంలో జూలై 21, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47,705 కు చేరింది. మంగళవారం నాడు మరో 1430 కేసులు నమోదు కాగా, 16,855 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. అలాగే కరోనా వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 429 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 2,062 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 36,385 కి చేరింది. ప్రస్తుతం 10,891 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 76 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.89 (< 1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1198):
- జీహెచ్ఎంసీ – 703
- రంగారెడ్డి – 117
- మేడ్చల్ - 105
- సంగారెడ్డి – 50
- నిజామాబాద్ - 48
- నల్గొండ – 45
- కామారెడ్డి – 43
- వరంగల్ అర్బన్ – 34
- కరీంనగర్ – 27
- మహబూబాబాద్ – 27
- జయశంకర్ భూపాలపల్లి – 27
- సూర్యాపేట – 27
- మెదక్ – 26
- వరంగల్ రూరల్ – 20
- జగిత్యాల – 18
- నాగర్ కర్నూల్ – 18
- సిద్ధిపేట – 14
- ఖమ్మం – 14
- జనగామ – 9
- వికారాబాద్ – 9
- యాదాద్రి భువనగిరి – 9
- రాజన్న సిరిసిల్ల – 8
- ఆదిలాబాద్ – 7
- మహబూబ్ నగర్ – 6
- మంచిర్యాల – 5
- భద్రాద్రి కొత్తగూడెం – 5
- జోగులాంబ గద్వాల – 4
- పెద్దపల్లి – 4
- నిర్మల్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu