ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రంలో కొత్తగా 6051 కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6051 కేసులతో కలిపి జూలై 27, సోమవారం ఉదయం 10 గంటల వరకు కేసుల సంఖ్య 102349 కు చేరింది. మరో 3234 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు.
గత 24 గంటల్లో 43127 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. కరోనా వలన పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, కడపలో ఒకరు, ప్రకాశంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1090 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 27, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 16,86,446
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 102349
- కొత్తగా నమోదైనా కేసులు : 6051
- నమోదైన మరణాలు : 49
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 49558
- యాక్టీవ్ కేసులు : 51701
- మొత్తం మరణాల సంఖ్య : 1090
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu