ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రభావం పెరుగుతుండడంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఆగస్టు 3, సోమవారం ఉదయం 10 గంటల వరకు కరోనా వలన మరణించిన వారి సంఖ్య 1537 కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 7822 పాజిటివ్ కేసులు, 63 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 166586 కు చేరింది. మరో 5786 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. గత 24 గంటల్లో 45516 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
కరోనా వలన గత 24 గంటల్లో పశ్చిమ గోదావరిలో పదకొండు మంది, విశాఖపట్నంలో తొమ్మిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, నెల్లూరులో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, విజయనగరంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1537 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 3, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 21,10,923
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 166586
- కొత్తగా నమోదైనా కేసులు : 7822
- నమోదైన మరణాలు : 63
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 88672
- యాక్టీవ్ కేసులు : 76377
- మొత్తం మరణాల సంఖ్య : 1537
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu