ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 605 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 26, శుక్రవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11489 కి చేరింది. 605 కేసుల్లో 570 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34, విదేశాల నుంచి వచ్చిన వారు ఒక్కరు ఉన్నారు. గత 24 గంటల్లో 22,305 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. ఈ కేసుల్లో 9353 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2136 మంది ఉన్నారు.
మరోవైపు కృష్ణాలో నలుగురు, కర్నూల్ లో నలుగురు, గుంటూరులో ఒకరు మరియు విశాఖపట్టణంలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 146 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికి 5196 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 6147 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu