ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీల కోసం సభ్యుల పేర్లు ఇవ్వాల్సిందిగా మండలి ఛైర్మన్ షరీఫ్ కోరగా టీడీపీ, బీజేపీ, ప్రొగ్రసీవ్ డెమొక్రటీవ్ ఫ్రంట్ పార్టీలు ఫిబ్రవరి 3న తమ సభ్యులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీలను నియమిస్తూ మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలను ఛైర్మన్లుగా నియమించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు చెందిన సెలెక్ట్ కమిటీకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని, సీఆర్డీఏ రద్దు బిల్లుకు చెందిన సెలెక్ట్ కమిటీకి బొత్స సత్యనారాయణను ఛైర్మన్లుగా నియమించారు. ఒక్కో కమిటీలో ఛైర్మన్ తో పాటుగా 8 మంది సభ్యులు ఉన్నారు. సెలక్ట్ కమిటీలను నియామిస్తూ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంకా అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. కమిటీల నియామకానికి సంబంధించిన వివరాలను ఛైర్మన్ షరీఫ్ అసెంబ్లీ కార్యదర్శికి పంపినట్లుగా తెలుస్తుంది.
సెలక్ట్ కమిటీల వివరాలు:
పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు(మూడు రాజధానుల బిల్లు) సెలెక్ట్ కమిటీ:
ఛైర్మన్: బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
సభ్యులు:
- నారా లోకేశ్
- పి.అశోక్బాబు
- జి.తిప్పేస్వామి
- జి.సంధ్యారాణి
- వెన్నపూస గోపాల్రెడ్డి
- కేఎస్ లక్ష్మణరావు
- పీవీఎన్ మాధవ్
సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీ:
ఛైర్మన్: బొత్స సత్యనారాయణ
సభ్యులు:
- జి.దీపక్రెడ్డి
- బచ్చుల అర్జునుడు
- బీద రవిచంద్ర
- గౌనివారి శ్రీనివాసులు
- షేక్ మహ్మద్ ఇక్బాల్
- ఇళ్ల వెంకటేశ్వరరావు
- సోము వీర్రాజు
[subscribe]