ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు/పాలకమండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 15 మంది సభ్యులతో కనక దుర్గ అమ్మవారి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ సోమవారం నాడు ప్రభుత్వం జీవో నెం.111 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 15 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు కలిసి చైర్మన్ ను ఎన్నుకోనున్నారు. బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి రెండేళ్ల పాటుగా పదవీలో ఉండనున్నారు. ఇక ఈ బోర్డులో ఎక్స్ అఫిషియయోగా దేవస్థాన ప్రధాన అర్చకుడు ఉండనున్నట్టు తెలిపారు.
కనక దుర్గ అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. కర్నాటి రాంబాబు, కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రామ్ బాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కల్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, కొలుకులూరి రామసీత, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, వేదకుమారినిలను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE