వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూహెచ్ఈఎఫ్) ప్రాంతీయ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ వేదిక కానుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు పదికి పైగా దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని డబ్ల్యూహెచ్ఈఎఫ్–2020 సదస్సు చైర్మన్ ఎస్.ఎన్.కుమార్ బుద్ధవరపు తెలిపారు. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ పార్కులో 8వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రాంతీయ సదస్సు ప్రారంభమవుతుందని, 9న ఆరు రంగాలపై ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయని కుమార్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రులు వి.మురళీధరన్, జి.కిషన్రెడ్డిలతోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్న డబ్ల్యూహెచ్ఈఎఫ్కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
[subscribe]