ప్రజలే కేంద్రంగా పురపాలికల్లో పాలన ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి కేటీఆర్

KTR Meeting With Municipal Commissioners, KTR Meeting With Town Planning Staff, Mango News Telugu, Minister KTR Latest News, Political Updates 2020, Telangana Breaking News, Telangana Municipal Commissioners, Telangana Political Updates
  • పురపాలక శాఖ కమిషనర్లు, నూతన కార్పోరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్
  • పురపాలన పట్ల ప్రభుత్వ విధానాలను, ఆలోచనలను స్పష్టం చేసిన కేటీఆర్
  • ప్రజలే కేంద్రంగా పురపాలన ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
  • పురపాలక శాఖాధికారులు పట్టణ ప్రజలతో మమేకం కావాలి
  • ప్రజలకు అందాల్సిన పౌర సేవలు అత్యంత పారదర్శకంగా, అవినీతి రహితంగా, వేగంగా అందాలన్న లక్ష్యంతో పలు విధానాలను తీసుకువస్తున్నాం
  • అవినీతికి తావులేకుండా, నిర్దిష్ట సమయంలో భవన నిర్మాణ అనుమతులు ప్రజలకు అందాలన్నదే తన లక్ష్యమన్న కేటీఆర్
  • ఈ విషయంలో ఎలాంటి అవినీతికి పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • నూతన మున్సిపల్ చట్టంలోని విధులే పురపాలక కమిషనర్ల జాబ్ చార్ట్ గా భావించాలి
  • ప్రజలతో మమేకమయేందుకు సోషల్ మీడియా వంటి వినూత్న వేదికలను విరివిరిగా ఉపయోగించాలి
  • ప్రజాసామ్యంలో ప్రజలే తమందరి అంతిమ బాస్ లు(యజమానులు) అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న కేటీఆర్

పురపాలికల్లో పాలన పూర్తిగా పౌరులే కేంద్రంగా జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. పురపాలక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత పురపాలక శాఖ కమిషనర్లు, నూతన కార్పోరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. పురపాలనలో భాగంగా ప్రజలకు మరింత చేరువ కావాలని ఈ సందర్భంగా వారికి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పురపాలక చట్టాన్ని ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ తన విధి నిర్వహణలో జాబ్ చార్ట్ గా పరిగణించాలని కోరారు. పట్టణ ప్రజలు అధికారుల నుంచి అద్భుతాలేమీ ఆశించడం లేదని, కేవలం వారి ప్రాథమిక అవసరాలు, పౌర సేవలందిస్తే సరిపోతుందన్న భావంతో ఉన్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆదిశగా పని చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. అధికార వికేంద్రీకరణే స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అదే స్పూర్తితో ప్రజలకు మరిన్ని పరిపాలన ఫలాలు అందాలన్న లక్ష్యంతో గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను కొత్తగా ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలంటే స్థానిక కమిషనర్లు తమతో పాటు పనిచేసే సిబ్బందితో, స్థానిక ప్రజలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

నూతన పురపాలక చట్టంలోని పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు, పురపాలనలో ఆన్లైన్ సేవలు మరియు టెక్నాలజీ వినియోగం, గ్రీవెన్స్ రిడ్రెస్సెల్, ఎలాంటి అవినీతికి తావులేకుండా భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేయాలన్నారు. ప్రతి పట్టణం యొక్క పారిశుధ్యం కమిషనర్ల ప్రాథమిక విధి అని మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉదయం 4:30 గంటలకే పట్టణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. దీంతోపాటు పారిశుద్ద్య నిర్వహణలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నం చేయాలన్నారు. పట్టణాలు, కార్పోరేషన్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాలి అన్నారు. మహిళలకు ప్రత్యేకంగా షీ టాయిలెట్ల నిర్మాణాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలిక బడ్జెట్ లో కనీసం పది శాతంతో గ్రీన్ ప్రణాళిక రూపకల్పన చేయాలని, పట్టణంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలన్నారు. ప్రతి పట్టణానికి శానిటేషన్ ప్లాన్ తో పాటు గ్రీన్ ప్లాన్ కూడా తయారు చేయాలని ఆదేశించారు. దీంతోపాటు సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన హెల్త్ ప్లాన్ తయారుచేసి ఉంచాలన్నారు. ఇందుకోసం అవసరమైతే వెటర్నరీ డాక్టర్ లు, ఎంటమాలజిస్ట్ లు మరియు ఇతర సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన పౌరసేవలు అవినీతి రహితంగా, అత్యంత పారదర్శకంగా ఉండాలన్న స్ఫూర్తితో అనేక నూతన చట్టాలు చేస్తున్నదని, అందులో భాగంగా పురపాలక శాఖలో తీసుకువస్తున్న టీఎస్ బిపాస్ ద్వారా 21 రోజుల్లో ప్రజలకి భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సిందేనని, ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలనలో అవినీతి అరికట్టేలా కఠినమైన చట్టాలు, విధానాలు రూపకల్పన చేస్తున్నామని, వీటి అమలులో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా కమిషనర్లతో కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏ అధికారైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలగించే అత్యంత కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ అమలును హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మానిటర్ చేస్తామని తెలిపారు.

పురపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని, పౌరులతో సంబంధాలని పెంచుకునే విషయంలో మరింత చొరవ చూపించాలని కమీషనర్లను మంత్రి కేటీఆర్ కోరారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలతో కలిసి పని చేస్తూ వారికి అపూర్వమైన సేవలందించి పట్టణాలపైన తనదైన చెరగని ముద్ర వేసే తీరుగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో తమందరికీ ప్రజలే అంతిమ బాస్ లు(యాజమానులు)లన్న విషయాన్ని గుర్తుంచుకొని, వారితో బాధ్యతయుతంగా ఉండాలన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను, నాయకులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని కేటీఆర్ అన్నారు. పురపాలనలో రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలు, వివిధ రంగాల్లో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాయాని, దీంతోపాటు జాతీయ స్థాయిలోనూ పలు నగరాలు వినూత్న విధానాలతో ముందుకు పోతున్నాయని వీటన్నిటిని పరిశీలించి వాటి స్ఫూర్తిగా స్థానికంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశానికి పురపాలకశాఖ విభాగాధిపతులతోపాటు నూతన కార్పోరేషన్ల కమీషనర్లు, పురపాలక సంఘాల మున్సిపల్ కమీషనర్లు, హెఛ్ఏండీఏ, జీహెఛ్ఏంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది హజరయ్యారు.

[subscribe]

Video thumbnail
CM KCR Superb Decision Over MSP For Farmers Crops | Telangana Municipal Election Results 2020
08:55
Video thumbnail
TRS MP Nama Nageswara Rao Praises CM KCR In Parliament Session | Lok Sabha 2020 | Mango News
07:09
Video thumbnail
Minister KTR Applauds TRS Party In Press Meet At Telangana Bhavan | Telangana Politics | Mango News
06:42
Video thumbnail
CM KCR About New Urban Development Scheme In Press Meet | Telangana Municipal Election Results 2020
05:51
Video thumbnail
Minister KTR Strong Warning To Party Leaders In Press Meet | Telangana Bhavan | Mango News
09:32
Video thumbnail
Minister KTR Speech About Greatness Of CM KCR In Press Meet | Telangana Political News | Mango News
09:06
Video thumbnail
Minister KTR Funny Comments On Uttam Kumar Reddy In Press Meet | Telangana Politics | Mango News
10:29
Video thumbnail
Governor Tamilisai Soundararajan Pays Homage To Mahatma Gandhi On His Commemoration Day | Mango News
03:10
Video thumbnail
Minister Harish Rao About KCR Letter To Centre Over Kaleshwaram & Mission Bhagiratha |Telangana News
02:52
Video thumbnail
KTR Gives Strong Assurance To Municipalities In Press Meet | Telangana Political News | Mango News
06:28
Video thumbnail
KTR Expresses His Happiness Over TRS Victory In Municipal Elections | Telangana News | Mango News
06:55
Video thumbnail
KTR Special Thanks To MIM Party For Supporting In Nizamabad | Telangana Political News | Mango News
08:12
Video thumbnail
CM KCR Congratulates Party President KTR In Press Meet | Telangana Municipal Election Results 2020
03:57
Video thumbnail
Only Congress Party Gives Strong Competition To TRS Party Says MP Revanth Reddy | Mango News
04:50
Video thumbnail
CM KCR Sensational Statements In Press Meet | Telangana Municipal Election Results 2020 | Mango News
04:02
Video thumbnail
CM KCR Rejects CAA In Telangana State | KCR Press Meet | Telangana Municipal Election Results 2020
11:55

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 17 =