ఆంధ్రప్రదేశ్లో ఎడ్సెట్ మరియు లాసెట్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. కాగా రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్సెట్ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎడ్సెట్లో 96.43 శాతం ఉత్తీర్ణత నమోదయిందని వెల్లడించారు. ఇక ఇక లా కాలేజీల్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాలకు లాసెట్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఎల్ఎల్బీ కోర్సు 3, 5 సంవత్సరాలు, ఎల్ఎల్ఎం రెండు సంవత్సరాల కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షకు రాయాల్సి ఉంటుంది. ఈరోజు విడుదలైన లాసెట్ ఫలితాల్లో.. 3ఏళ్ల కోర్సుకు గాను 90.81శాతం, 5ఏళ్ల కోర్సుకు గాను 79.51శాతం ఉత్తీర్ణత నమోదయింది పేర్కొన్నారు. అలాగే రెండేళ్ల పీజీ ఎల్ సెట్లో 97.24శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కాగా లాసెట్లో అత్యధిక ర్యాంకులు సాధించిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారని హేమచంద్రా రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY